రాజధానిపై తేల్చండి.. సీఎం కాన్వాయ్ వద్ద రైతుల నిరసన
ఏపీ రాజధాని అమరావతిని మార్చబోతున్నారన్న వార్తలతో ఆ ప్రాంత రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని సెగ సీఎం జగన్ను తాకింది. మంగళవారం ముఖ్యమంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు రాజధాని ప్రాంత రైతులు విఫలయత్నం చేశారు. తాడేపల్లి నుంచి సచివాలయానికి వెళ్తున్న దారిలో తాళ్లాయ పాలెం దగ్గర రోడ్డు పక్కన.. సీఎం కాన్వాయ్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో […]
ఏపీ రాజధాని అమరావతిని మార్చబోతున్నారన్న వార్తలతో ఆ ప్రాంత రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని సెగ సీఎం జగన్ను తాకింది. మంగళవారం ముఖ్యమంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు రాజధాని ప్రాంత రైతులు విఫలయత్నం చేశారు. తాడేపల్లి నుంచి సచివాలయానికి వెళ్తున్న దారిలో తాళ్లాయ పాలెం దగ్గర రోడ్డు పక్కన.. సీఎం కాన్వాయ్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోని వారిని అడ్డుకున్నారు. తాము నిరసన వ్యక్తం చేస్తుంటే సీఎం కారులో నుంచే నమస్కరిస్తూ పట్టించుకోకుండా వెళ్లడం బాధాకరమని వారు వాపోయారు. రాజధాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని.. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.