ప్రముఖ నటి రేఖ బంగ్లాకి సీల్..
ప్రముఖ నటి రేఖా బంగ్లాని సీల్ చేశారు ముంబై అధికారులు. బాంద్రాలో ఉన్న రేఖా బంగ్లాకి సీ స్ప్రింగ్స్ అని పేరు. బంగ్లా ముందుండే ఇద్దరు సెక్యూరిటీ గార్డుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రేఖ బంగ్లాను కంటైన్మెంట్ జోన్గా...
ప్రముఖ నటి రేఖా బంగ్లాని సీల్ చేశారు ముంబై అధికారులు. బాంద్రాలో ఉన్న రేఖా బంగ్లాకి సీ స్ప్రింగ్స్ అని పేరు. బంగ్లా ముందుండే ఇద్దరు సెక్యూరిటీ గార్డుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రేఖ బంగ్లాను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది బీఎంసీ. అలాగే పరిసరాలను శుభ్రం చేశామని బీఎంసీ వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఇప్పటిదాకా నటి రేఖ స్పందించలేదు.
కాగా ప్రస్తుతం ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ వైరస్ మహమ్మారి వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాల నొప్పితో అమితాబ్ నానావతి ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అమితాబ్ కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇక దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,38,461 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9,893 మంది మరణించారు. ఇక అలాగే 95,943 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,32,625 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.