Prabhas Adipurush movie: రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించనున్నారు. ఇక ఈ మూవీలో మిగిలిన పాత్రాధారులకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో ఇందులో సీత పాత్రకు గానూ కీర్తి సురేష్, కియారా అద్వాణీ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ పాత్రకు గానూ మరో నటి పేరు వినిపిస్తోంది.
మాజీ మిస్ ఇండియా(2015) ఊర్వశి రౌటెలాను ఇందులో సీత పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు ఊర్వశి బాగా సరిపోతుందని భావిస్తోన్న దర్శకుడు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే 2013లో సింగ్ సాబ్ ద గ్రేట్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఊర్వశి.. అక్కడ పలు సినిమాలు, వెబ్సిరీస్లు, మ్యూజిక్ వీడియోల్లో నటించారు. ఇప్పుడు బ్లాక్ రోజ్ అనే చిత్రంతో తెలుగుకు కూడా పరిచయం అవ్వబోతున్నారు. కానీ ఇంతవరకు ఆమె ఏ టాప్ హీరోతోనే జతకట్టలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఊర్వశిని సంప్రదిస్తున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంత..? ప్రభాస్ సరసన ఎవరు నటిస్తారు..? హనుమంతుడు, లక్ష్మణుడు.. ఇలా మిగిలిన ప్రధానపాత్రల్లో ఎవరు నటిస్తారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీని టీ-సిరీస్ నిర్మిస్తోంది. 3డీలో తెరకెక్కనున్న ఈ మూవీపై ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Read More:
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్
ఇది చివరిది కాదు.. సిద్ధంగా ఉండటం మంచిది: డబ్ల్యూహెచ్ఓ