బుల్లితెరపై టాప్ యాంకర్గా దూసుకుపోతున్న అనసూయ.. సోషల్ మీడియాలోనూ దూకుడు మీదుంటారు. తాజాగా ఈమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. అయితే అప్పుడప్పుడూ తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి వివాదం సృష్టిస్తుందనే ఇమేజ్ ఈమె సొంతం. ఒక్క ట్వీట్తో మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చారు అనసూయ భరద్వాజ్. తాజాగా విజయ్ దేవరకొండ పేరు పెట్టకుండా.. ఓ పోస్ట్ చేసారు అనసూయ. ‘ది’ నా.. బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం అంటూ ఒక పోస్ట్ షేర్ చేసారు ఈ యాంకర్. అందులో ఏముంది అనుకోవచ్చు.. అక్కడే ఉంది అసలు మ్యాటర్. ఈ మధ్యే ఖుషీ పోస్టర్లో విజయ్ పేరుకు ముందు ‘ది’ అని ఉంది. అది హైలైట్ చేస్తూ.. అనసూయ ఈ ట్వీట్ చేసారని అనసూయను ట్రోల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఆమె వారికి కౌంటర్స్ ఇస్తూనే ఉంది. ఇక హరీశ్ శంకర్ లాంటి దర్శకులు సైతం ‘ది’ అనే సంభోదిస్తూ.. విజయ్కు బర్త్ డే విషెస్ చెప్పారు.
కాగా అర్జున్ రెడ్డి టైమ్ నుంచే అనసూయ, విజయ్ మధ్య గొడవ మొదలైంది. మొదలు పెట్టింది మాత్రం అనసూయే అంటారు విజయ్ ఫ్యాన్స్. అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజీపై విజయ్ మాట్లాడిన ఓ మాట అనసూయకు నచ్చక విమర్శించారు.. ఆ తర్వాత ఎప్పుడు ఛాన్సొచ్చినా విజయ్పై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యలో విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటించారు అనసూయ.
మీకు మాత్రమే చెప్తా సినిమా తర్వాత విజయ్, అనసూయ మధ్య అంతా సర్దుకుందనుకున్నారంతా. కానీ ఇంకా కాలేదని తాజాగా ఈమె ట్వీట్తో అర్థమవుతుంది. నువ్వు విజయ్ను ట్రోల్ చేస్తే.. మేం ఆంటీ పదాన్ని ట్రెండ్ చేస్తామంటున్నారు ఫ్యాన్స్. మరి ఇదెక్కడ ఆగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..