Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్.. హాజరవుతున్న అతిథులు
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్పుర్ వేదికగా ఈ శుభకార్యం అట్టహాసంగా జరిగింది. గ్రాండ్ వెడ్డింగ్ అనంతరం విజయ్ సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతో పాటు నూతన గృహప్రవేశం కూడా చేశారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ విందు భోజనాలు కూడా పెట్టించారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట విజయ్ సొంత ఊరులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే ఊరి ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. విజయ్, రష్మిక పెళ్ళికి కొద్ది మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ రోజు(మార్చి 4)న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
Published on: Mar 04, 2026 07:18 PM
Loading...
Unable to load recommendations.
Follow Us
