AnushkaShetty : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. దాదాపు అందరు హీరోలసరసన నటించిన అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. ఇక ఇటీవల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నిశ్శబ్దం ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ‘నిశ్శబ్దం’ సినిమా కంటే ముందే భాగమతి అనే హారర్ సినిమా చేసింది అనుష్క. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అనుష్క శెట్టితో ‘భాగమతి 2’ చిత్రాన్ని రూపొందించడానికి యూవీ క్రియేషన్స్ సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క యువీ క్రియేషన్స్ లోనే సినిమా చేస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా భాగమతి సీక్వెల్ అని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. బాహుబలి’తో వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అనుష్క కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో భాగమతి 2 కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాకోసం సన్నబడటానికి కసరత్తులు కూడా చేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం సినిమాలు కూడా తీస్తూ వస్తున్న యూవీ క్రియేషన్స్ .
మరిన్ని ఇక్కడ చదవండి :
Sreekaram Grand Release Event LIVE: ఘనంగా శ్రీకారం గ్రాండ్ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్గా కేటీఆర్..