Rajinikanth: రజినీకాంత్ మంచి మనసు.. పేద విద్యార్థుల కోసం భారీగా విరాళం..

|

Aug 25, 2024 | 3:10 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రం బాక్సాఫీస వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. చాలా కాలం తర్వాత జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు తలైవా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు రజినీ. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్నారు.

Rajinikanth: రజినీకాంత్ మంచి మనసు.. పేద విద్యార్థుల కోసం భారీగా విరాళం..
Rajinikanth
Follow us on

సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. వేలూరు జిల్లాకు చెందిన 17 మంది పేద విద్యార్థుల ట్యూషన్ ఫీజును దాదాపు రూ.12 లక్షలు చెల్లించారు. కొన్నాళ్లుగా తన ఫౌండేషన్ ద్వారా పేద కళాశాల విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వేలూరు జిల్లాకు చెందిన 17 మంది విద్యార్థుల చదువు కోసం సుమారు 12 లక్షలు చెల్లించాడు. ఇందులో ఒక్కో విద్యార్థికి గరిష్టంగా 1లక్ష 12వేలు, కనిష్టంగా ఒక్కో విద్యార్థికి 34వేలు, మొత్తం 17మంది విద్యార్థులకు 12లక్షల రూపాయలు చెల్లించారు. వేలూరు జిల్లా రజినీ అభిమాన సంఘం నిర్వాహకులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. తమ అభ్యర్థనను అంగీకరించి అందరికీ ట్యూషన్ ఫీజు అందించినందుకు తలైవాకు వేలూరు జిల్లా రజనీకాంత్ అభిమాన స్వచ్ఛంద మండలి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రం బాక్సాఫీస వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. చాలా కాలం తర్వాత జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు తలైవా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు రజినీ. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్నారు. జైం భీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత రజినీ, అమితాబ్ కలిసి నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, రజినీ కాంబోలో కూలీ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర నటిస్తున్నాడు.

ఇవే కాకుండా త్వరలోనే మరో క్రేజీ దర్శకుడితో రజినీ చేతులు కలపబోతున్నాడు. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు మారి సెల్వరాజ్ డైరెక్షన్లో రజినీ నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Rajinikanth New

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.