జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికి గురై చిత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 10 మంది విద్యుదాఘాతానికి గురి కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్, మృతి చెందిన అభిమానుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన ఒక్కో అభిమాని కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
My Deep condolences . pic.twitter.com/3EN4Tri4za
— Allu Arjun (@alluarjun) September 2, 2020
Also Read :