ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ సాయి పల్లవి. తొలి సినిమాతోనే నేచురల్ బ్యూటీగా ప్రేక్షకులను మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది పల్లవి. ఇక ఈ చిన్నది నటించిన సినిమాలు దాదాపు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగులో తండేల్ అనే సినిమా చేస్తోంది. అలాగే తమిళ్లో అమరన్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాయి పల్లవిని ఇష్టపడని సినీ ప్రేక్షకుడు ఉండడు. సినీ ప్రేమికులు మాత్రమే కాదు, చాలా మంది సినీ నటీనటులు సాయి పల్లవి నటనకు, అన్నింటికంటే ఎక్కువగా సాయి పల్లవి వ్యక్తిత్వానికి అభిమానులు. సాయి పల్లవి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోదు. అయితే ఇప్పుడు కొందరు సాయి పల్లవి పాత వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయి పల్లవి నటించిన ‘అమరన్’ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో అమర సైనికుడు మేజర్ ముకుందన్ భార్య రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. మేజర్ ముకుందన్ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందాడు. మేజర్ ముకుందన్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నారు. ఇప్పుడు సాయిపల్లవి సినిమా విడుదలవుతున్నప్పుడు కొందరు సాయిపల్లవి పాత వీడియోను షేర్ చేస్తూ ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాయి పల్లవి ‘విరాట పర్వం’ అనే సినిమా చేసింది. సినిమాలో సాయి పల్లవి ఒక నక్సల్తో ప్రేమలో పడి తానే నక్సల్గా మారడం చూపించారు. ఈ సినిమా ప్రమోషన్లో సాయి పల్లవిని నక్సల్స్ హింస గురించి అడిగారు. ఆ ప్రశ్నకు సాయి పల్లవి.. హింస అంటే అర్థం కావడం లేదు. పాకిస్థానీలకు, మనం.. అలాగే మన సైనికులను చూస్తే, వాళ్లు ముప్పు అని, ఉగ్రవాదులని భావిస్తారు. వాళ్లను చూస్తే మనం ఉగ్రవాదులు అనుకుంటాం.’ ఈ వీడియో క్లిప్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొంతమంది సాయి పల్లవి భారత సైనికులను టెర్రరిస్టులని అర్ధం వచ్చేలా మాట్లాడిందని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు ముందు ఇదే సినిమా ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూయర్ మీరు లెఫ్ట్వింగ్ లేదా రైట్వింగ్ అని అడిగిన ప్రశ్నకు. సాయి పల్లవి బదులిస్తూ, నేను ఏ వర్గానికి చెందిన దాన్ని కాదు. కానీ హింసకు కారణం అయ్యే మతానికి నేను వ్యతిరేకం. హిందువులపై ముస్లింలు ఎలా అఘాయిత్యాలకు పాల్పడ్డారో ‘కశ్మీర్ ఫైల్స్’ చూపించాయి. అదేవిధంగా ఇటీవల ఆవును తరలిస్తున్న ఓ ముస్లిం లారీ డ్రైవర్ను ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తూ కొట్టి చంపారు. నాకు, ఈ రెండు సంఘటనలు ఒకటే అని చెప్పింది. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చివరగా దీనిపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి.. ఏ వ్యక్తిని, సంఘటనను, పరిస్థితిని మతం కోణంలో విభజించి చూడడానికి నేను వ్యతిరేకం అని తెలిపింది. ఈ కామెంట్స్ ను ఇప్పుడు మరోసారి వైరల్ చేస్తున్నారు.
When the terrorists from Pakistan made multiple attacks on India in the past by invading into our territory, they were obviously brainwashed with the statement as shown in the trailer. One can understand that and that’s how they will think.
But the video clip of Sai Pallavi’s… pic.twitter.com/1ICGiWoZsB
— Raghu Rajaram (@RaghuTweetbook) October 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.