Sarkaru Vaari Paata: టెన్షన్లో ‘సర్కారు వారి పాట’ టీమ్.. అనుకున్న టైమ్కు సినిమా వచ్చేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీతగోవిందం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీతగోవిందం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయ్యింది. ఈ సినిమాతో మొదటిసారి మహేష్ తో కలిసి నటిస్తుంది అందాల భామ కీర్తిసురేష్. ఇదిలా ఉంటే ప్రస్తుతం సర్కారు వారి పాట టీంకు కోవిడ్ టెంక్షన్ పట్టుకుంది. ఇప్పటికే కరోనా సెంకడ్ వేవ్, మహేశ్ మోకాలి సర్జరీ కారణంగా.. పడుతూ లేస్తూ సాగుతున్న ఈ మూవీ షూటింగ్కు మరో బిగ్ బ్రేక్ పడింది. దీంతో ఈ మూవీ టీం తెగ ఆందోళన చెందుతోందని టాక్.
ఇప్పటికే సర్జరీ అనంతరం దుబాయ్ రెస్ట్ తీసుకుంటున్న మహేశ్ బాబు తనకు కోవిడ్ పాజిటివ్ గా అనౌన్స్ చేశారు. ఆయనతో పాటే సర్కారు మూవీ కి వర్క్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కరోనా వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక వీరిద్దరితో పాటే సర్కారు డైరెక్టర్ పరువురాం సెల్ప్ క్యారెంటైన్ విధించుకున్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే మహేశ్ సర్జరీ నుంచి కోలుకోడానికి రెస్ట్ తీసుకుంటున్న క్రమంలోనే డైరెక్టర్ పరుశురామ్.. తమన్ తో కలిసి దుబాయ్లో మ్యూజిక్ సిట్టింగ్స్ను ఏర్పాటు చేశారు. ఇక ఈ సిట్టింగ్స్ జరిగిన మరుసటి రోజే మహేశ్ అండ్ తమన్ కరోనా వైరస్ కు చిక్కుకున్నారు. పరుశురామ్ క్యారెంటైన్కు వెళ్లారు. దీంతో వీరిని కలిసిన వారు సర్కారు టీంలో ఇంకెవరైనా ఉన్నారని ఆరా తీస్తున్న మైత్రి వారు వారిని కూడా సెల్ఫ్ క్యారెంటైన్కు పంపిస్తూ… మరింత డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారట. దాంతో ఇప్పుడు మహేష్ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న టెన్షన్ అభిమానుల్లో కలుగుతుంది. ఇప్పటికే సినిమాను సంక్రాంత్రి నుంచి సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు కరోనా కారణంగా అనుకున్న తేదీకి సినిమా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :