RadheShyam: ఓటీటీలో రిలీజ్ కానున్న ప్రభాస్ రాధేశ్యామ్ ?.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాహో అనంతరం ప్రభాస్

RadheShyam: ఓటీటీలో రిలీజ్ కానున్న ప్రభాస్ రాధేశ్యామ్ ?.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Radheshyam
Follow us

|

Updated on: Jan 26, 2022 | 6:44 PM

పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాహో అనంతరం ప్రభాస్ మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. దాదాపు రెండేళ్లుగా డార్లింగ్ సినిమా కోసం అతని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాధాకృష్ణ (RadhaKrishna) దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ (RadheShyam) కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఓటీటీ సంస్థలతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్, జీ 5 నుంచి ఈ సినిమాకు భారీ ఆఫర్ వచ్చినట్లుగా టాక్. అయితే రాధేశ్యామ్ సినిమాపై వస్తున్న రూమర్స్ పై డైరెక్టర్ రాధాకృష్ణ స్పందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ విషెస్ చెప్పి… త్వరలోనే రాధేశ్యామ్ థియేటర్లలోకి రాబోతుందంటూ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో రాధేశ్యామ్ సినిమా విడుదలపై వస్తున్న రూమర్లకు పుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Also Read: Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారో ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మతిపోగొట్టింది..

Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..

Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..

Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..