Tollywood: బట్టలు మార్చుకోవడానికి చెట్ల వెనకకు వెళ్లాల్సి వచ్చింది.. వాష్ రూమ్ లేదు.. హీరోయిన్ ఆవేదన..

ప్రస్తుతం ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ తమ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ 90'sలో అందం, అభినయంతో కట్టిపడేసింది. కొన్ని రోజులుగా ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్‌లోని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన తొలి సినిమా అనుభవం గురించి, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను చెప్పుకొచ్చింది.

Tollywood: బట్టలు మార్చుకోవడానికి చెట్ల వెనకకు వెళ్లాల్సి వచ్చింది.. వాష్ రూమ్ లేదు.. హీరోయిన్ ఆవేదన..
Actress
Follow us

|

Updated on: Aug 26, 2024 | 11:07 AM

సినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ కెరీర్ ఆరంభంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అవమానాలు, సవాళ్లు, విమర్శలను స్వీకరించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ ప్రస్తుతం ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ తమ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ 90’sలో అందం, అభినయంతో కట్టిపడేసింది. కొన్ని రోజులుగా ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్‌లోని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన తొలి సినిమా అనుభవం గురించి, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను చెప్పుకొచ్చింది.

అప్పట్లో హీరోహీరోయిన్స్ కోసం కేరవాన్ లేదని.. అందుకే బట్టలు మార్చుకోవడానికి చెట్టు వెనకాలే వెళ్ళేవాళ్ళమని అన్నారు. అలాగే బాత్రూంకి వెళ్ళడానికి చెట్ల వెనుకకు వెళ్ళామని.. కానీ గత 40-50 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఇప్పుడు నటీనటులు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని..మొదటి సినిమా ‘దిల్ తో పాగల్ హై’ సమయంలోనే తొలిసారిగా సెట్స్‌పై మానిటర్‌ను ఉపయోగించారని… డ్యాన్స్ షూట్ సమయంలో యష్జీ షూటింగ్ కి వచ్చినప్పుడు యాక్టింగ్, డాన్స్ చేసేవాళ్లమని.. ఆ తర్వాత మానిటర్‌లో వచ్చి చూసేవాళ్లమని కరిష్మా తెలిపింది.

ఇవి కూడా చదవండి

జుబైదా షూటింగ్ సమయంలో తాను మొదట వాయిస్ సింక్ గురించి తెలుసుకున్నానని.. తన వాయిస్ కోసం ల్యాపెల్ మైక్రోఫోన్ ధరించడం ఇదే తొలిసారి అని నటి తెలిపింది. ప్రేమ్ కాడి సినిమాతో కరిష్మా కపూర్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత జిగర్, రాజాబాబు, అందాజ్, రాజా హిందుస్తానీ, కూలీ నంబర్ చిత్రాల్లో నటించారు. కరిష్మా దేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకుంది. సంజయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కరిష్మా నటనకు దూరంగా ఉంది. కానీ వీరి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. 2016లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన తొలిరాత్రి భర్త సంజయ్ కపూర్ తనను చిత్రహింసలకు గురిచేశాడని కరిష్మా పేర్కొంది. సంజయ్ కపూర్ నుండి విడాకుల సమయంలో, కరిష్మా కపూర్ భారీ మొత్తాన్ని భరణంగా తీసుకుంది. విడాకుల తర్వాత, సంజయ్ కరిష్మాకు విలాసవంతమైన ఇల్లుతో పాటు 14 కోట్లు ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.