జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గ పెరిగిపోయింది. తారక్ వరుసగా బడా సినిమాలను లైనప్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం తారక్ థాయ్లాండ్లో ఉన్నాడు. తన రాబోయే చిత్రం ‘దేవర’ ప్రత్యేక పాట చిత్రీకరణ కోసం తారక్అ క్కడికి చేరుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.
ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఆ తర్వాత అదే తేదీకి రజనీకాంత్ తన సినిమాను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత ‘దేవర ‘ విడుదల తేదీ మారింది. దీనితో పాటు హృతిక్ రోషన్ ‘వార్ 2’లో కూడా కనిపించనున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ రెండు చిత్రాల తర్వాత, తారక్ KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలిక టైటిల్ ‘డ్రాగన్’ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా పనులు ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో అలియా భట్ నటిస్తుందని తెలుస్తోంది. మరోసారి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది అలియా. ఈ వార్త అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచింది. తారక్ తో RRR లో చేసింది ఈ బ్యూటీ. అలాగే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అలియా భట్ కాకుండా మరో నటి కూడా ఉండొచ్చని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..