సుశాంత్ కేసు రిపోర్టులను పరిశీలించనున్న ‘ఎయిమ్స్’ ఫోరెన్సిక్ బృందం

సుశాంత్ కేసులో అన్ని రిపోర్టులను సీబీఐ మళ్ళీ పరిశీలించనుంది. ఇందులో భాగంగా మెడికో లీగల్ ఒపీనియన్ కోసం సుశాంత్ పోస్ట్ మార్టం వివరాలను తెలుసుకోవడానికి ఎయిమ్స్ లోని ఫోరెన్సిక్ బృందాన్ని సంప్రదించింది.

సుశాంత్ కేసు రిపోర్టులను పరిశీలించనున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం

Edited By:

Updated on: Aug 22, 2020 | 10:38 AM

సుశాంత్ కేసులో అన్ని రిపోర్టులను సీబీఐ మళ్ళీ పరిశీలించనుంది. ఇందులో భాగంగా మెడికో లీగల్ ఒపీనియన్ కోసం సుశాంత్ పోస్ట్ మార్టం వివరాలను తెలుసుకోవడానికి ఎయిమ్స్ లోని ఫోరెన్సిక్ బృందాన్ని సంప్రదించింది. సుశాంత్ అటాప్సీ రిపోర్టుల పరిశీలనకు గాను ఈ ఆసుపత్రికి చెందిన ప్ ఫోరెన్సిక్ నిపుణుల్లో ఐదుగురితో కూడిన ప్రత్యేక బృందం కూడా ఏర్పాటైంది. ఇక సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా సీక్వెన్స్ రిక్రియేషన్,  సాక్ష్యాధారాల సేకరణ, అధ్యయనం వంటివాటిని నిర్వహిస్తుందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంటే మళ్ళీ మొదటి నుంచీ అన్ని అంశాలనూ సీబీఐ స్టడీ చేస్తుందని, ముంబై పోలీసుల దర్యాప్తును కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటామని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

ముంబై పోలీసులు ఇప్పటివరకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదించకపోయినప్పటికీ, సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టును తమ దర్యాప్తులో భాగంగా సేకరించారు. అందులో…. సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని, ఊపిరి ఆడకపోవడంవల్లే మరణించాడని స్పష్టం చేశారు.

 

Follow Us