Andhadun Telugu Remake: ‘భీష్మ’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత నితిన్ బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్లో నటించబోతున్నాడు.
ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరోయిన్గా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ని తీసుకున్నారని టాక్. ఇక మాతృకలో టబు పోషించిన పాత్ర కోసం మొదట స్టార్ హీరోయిన్ నయనతారను సంప్రదించారట చిత్ర యూనిట్. అయితే ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో.. మరో స్టార్ హీరోయిన్ శ్రియతో సంప్రదింపులు జరిపారట. ఆమె కూడా ఈ పాత్రకు నో చెప్పడంతో.. టబు దగ్గరకి ఈ రోల్ వెళ్ళినట్లు తెలుస్తోంది. టబుది ఇందులో ప్రధాన పాత్ర, కథ కూడా ఆమె చుట్టూనే తిరుగుతుండటంతో ఆమె భారీ రెమ్యునరేషన్ అడిగిందని టాక్. దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Also Read:
‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!
ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!
”టాలీవుడ్లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..
IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్లు.. ఎప్పుడంటే..
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్లైన్ రమ్మీపై నిషేధం.!