నివేథా కీలక నిర్ణయం.. అభినందించాల్సిందే!

| Edited By:

Sep 01, 2020 | 4:25 PM

అందం, అభినయం రెండూ కలిసి ఉన్న నటుల్లో నివేథా థామస్ ఒకరు. నాని నటించిన జంటిల్‌మన్ చిత్రంతో

నివేథా కీలక నిర్ణయం.. అభినందించాల్సిందే!
Follow us on

Nivetha Thomas News: అందం, అభినయం రెండూ కలిసి ఉన్న నటుల్లో నివేథా థామస్ ఒకరు. నాని నటించిన జంటిల్‌మన్ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నివేథా.. ఇక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. కాగా తన ఖాతాలో సక్సెస్‌లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. రెమ్యునరేషన్ విషయంలో నివేథా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నివేథా.. సినిమాల్లో తన పాత్ర బావుంటే కచ్చితంగా రెమ్యునరేషన్‌ని తగ్గించుకుంటానని తెలిపారు. ఫిలిం మేకర్లకు కచ్చితంగా సపోర్ట్ చేయాలని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇది నిజంగా అభినందించదగ్గ విషయమే. ఎందుకంటే ఒక్క భారీ సక్సెస్ ఖాతాలో పడ్డాక తమ రెమ్యునరేషన్‌ని పెంచే హీరోయిన్లు చాలా మందే ఉంటారు. కానీ నివేథా అలా కమర్షియల్‌గా ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం గమనర్హం.

కాగా నాని, సుధీర్ బాబు, నివేథా, అదితీ రావు హైదరీ నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 5న ఈ మూవీ అమెజాన్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అవ్వబోతోంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

ఫ్రంట్‌లైన్ వారియర్లకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఫావిలో

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై విచారణ వాయిదా