రెహమాన్ బాధ.. సంగీత దర్శకులు ఇప్పటికైనా మారుతారా..!

| Edited By:

Apr 11, 2020 | 2:50 PM

సంగీత దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ కష్టాన్ని ఖూనీ చేస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు చేశారు.

రెహమాన్ బాధ.. సంగీత దర్శకులు ఇప్పటికైనా మారుతారా..!
Follow us on

సంగీత దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ కష్టాన్ని ఖూనీ చేస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే ఆయన అసహనంలో ఓ అర్థం ఉంది. అందుకే నెటిజన్లు కూడా రెహమాన్‌కు తమ మద్దతును తెలుపుతున్నారు. ఇంతకు రెహమాన్‌ ఎందుకు ఫీల్ అయ్యారంటే..!

సిద్ధార్థ్‌ మల్హోత్రా, తారా సుటారియాలతో ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘మసక్కలి 2.0’ పేరుతో ఓ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రీమిక్స్‌కు తనిష్క్ బాగ్చీ సంగీతం అందించగా.. తులసి కుమార్‌, సచెట్‌ టాండన్ ఆలపించారు. ఇక ఈ పాట విడుదలైనప్పటి నుంచి మంచి వ్యూస్ వచ్చినప్పటికీ.. అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. రెహమాన్ పాటను ఖూనీ చేశారంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రెహమాన్‌ కూడా తన పాటను ఖూనీ చేశారంటూ పరోక్షంగా కామెంట్లు చేశారు. ”ఒక పాటను రూపొందించడానికి నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. పలుమార్లు మార్చి మార్చి పాటను రూపొందించాల్సి ఉంటుంది. మసక్కలి పాట కోసం సుమారు 200 మంది సంగీతకారులు పనిచేశారు. ఒరిజనల్ పాటను మీరు ఒకసారి వినండి” అని కామెంట్ పెట్టారు. ఆయనే ఒరిజనల్ సాంగ్ లిరిసిస్ట్ కూడా మసక్కలి 2.0పై కామెంట్లు చేశారు.

అయితే రీమిక్స్‌లపై రెహమాన్ స్పందించడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ ఆయన రీమిక్స్‌ పాటలపై అసహనం వ్యక్తం చేశారు. రీమిక్స్‌ పాటలను వింటుంటే తనకు చాలా బాధగా ఉందని ఆస్కార్ అవార్డు గ్రహీత అన్నారు. తనకు నచ్చిన రీమిక్స్‌ ‘హమ్మ హమ్మ’ ఒక్కటే అని కూడా తెలిపారు. కాగా ఇది రెహమాన్‌ ఒక్కరి బాధే కాదు. అన్ని భాషల్లోనూ పలు పాటలు రీమిక్స్‌ చేస్తున్నారు. వాటిలో కొన్ని మాత్రమే బావుంటాయి. దీంతో వాటిని కంపోజ్‌ చేసిన ఒరిజనల్ సంగీత దర్శకులతో పాటు అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచి పాటలను చెడగొడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడైనా రీమిక్స్‌ విషయంలో మ్యూజిక్‌ డైరక్టర్లు తమ పంథాను మార్చుకుంటారేమో చూడాలి.

Read This Story Also: లాక్‌డౌన్ ఎఫెక్ట్: టీఆర్పీలో అదరగొట్టేసిన చెర్రీ ఫ్లాప్ మూవీ..!