ప్రభాస్ ఆదిపురుష్‌: ‘శూర్పణక’గా రెడీ అంటోన్న మంచు లక్ష్మి

రెబల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'‌లో నటించనున్నారు. ప్రభాస్ 22వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.

ప్రభాస్ ఆదిపురుష్‌: 'శూర్పణక'గా రెడీ అంటోన్న మంచు లక్ష్మి
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 6:47 PM

Manchu Lakshmi as Surpanaka: రెబల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’‌లో నటించనున్నారు. ప్రభాస్ 22వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. 3డీలో తెరకెక్కబోతున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఆదిపురుష్‌ విడుదల కానుంది. ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా రామాయణం ఆధారంగా తెరకెక్కబోతున్న ఇందులో ఎవరెవరు నటించబోతున్నారన్న చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. హిందీ వారినే తీసుకుంటారా..? లేక మన తెలుగు వారిని, అలాగే దక్షిణాది నటులను ఇందులో భాగం చేయనున్నారా..? అని ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరుగుతోంది.

ఇదిలా ఉంటే ఇందులో శూర్పణక పాత్ర చేసేందుకు తాను రెడీ అంటున్నారు మంచు లక్ష్మి. వైవిధ్య పాత్రలు చేసేందుకు ఆసక్తిని చూపే ఈ నటి, ఆదిపురుష్‌తో శూర్పణక పాత్రలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా ఓకే చెప్తానని అన్నారు. ఆదిపురుష్ ప్రకటన వచ్చిన తరువాత ప్రభాస్‌ టీమ్‌కి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ స్పందిస్తూ.. ”ఇందులో శూర్పణక పాత్ర మీరే చేయాలి. ఈ విషయాన్ని దర్శకుడికి తాము సజెస్ట్ చేస్తాము” అని కామెంట్ పెట్టారు. అందుకు మంచు లక్ష్మి ”వావ్‌.. నేను చేస్తాను. ఎక్కడ సంతకం చేయాలి” అని కామెంట్ పెట్టారు. కాగా అనగనగా ఓ ధీరుడులో మంచు లక్ష్మి విలన్‌గా కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వనప్పటికీ.. అందులో మంచు లక్ష్మి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఒకవేళ ఇప్పుడు శూర్పణక పాత్రకు మంచు లక్ష్మిని ఫైనల్ చేసినా.. ఆ పాత్రకు ఆమె కచ్చితంగా న్యాయం చేయగలదనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

Read More:

నా కుమారుడు అమాయకుడు.. దిశ గురించి ఏం తెలీదు: జరీనా వాకబ్‌

నాన్న ఆరోగ్యం విషమంగానే ఉంది.. ఎస్పీ చరణ్ భావోద్వేగ వీడియో