ఫస్ట్ లుక్ అదిరిపోయింది..పుల్ పిక్చర్ ఎలా ఉండబోతోందో?

|

May 18, 2019 | 3:19 PM

ముంబయి: దక్షిణాదిలో సూపర్‌హిట్‌ సిరీస్‌గా నిలిచిన ‘కాంచన’ ఇప్పుడు బాలివుడ్‌లోనూ సందడి చేయబోతోంది. ఈ క్రేజీ హర్రర్ సిరీస్‌కు ఆద్యుడైన రాఘవా లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘లక్ష్మీ బాంబ్‌’  టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.  ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఫర్హాద్‌ సామ్‌జీ సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. దీంతో పాటు సినిమా […]

ఫస్ట్ లుక్ అదిరిపోయింది..పుల్ పిక్చర్ ఎలా ఉండబోతోందో?
Follow us on

ముంబయి: దక్షిణాదిలో సూపర్‌హిట్‌ సిరీస్‌గా నిలిచిన ‘కాంచన’ ఇప్పుడు బాలివుడ్‌లోనూ సందడి చేయబోతోంది. ఈ క్రేజీ హర్రర్ సిరీస్‌కు ఆద్యుడైన రాఘవా లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘లక్ష్మీ బాంబ్‌’  టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.  ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఫర్హాద్‌ సామ్‌జీ సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది జూన్‌ 5న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఫస్ట్‌లుక్‌లో అక్షయ్‌ కళ్లకు కాటుక పెట్టుకుంటూ కనిపించారు. ఓ చక్కటి కథను మీకు చూపించబోతున్నాం అంటూ అక్షయ్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. అదే విధంగా కియారా ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తన తర్వాతి ప్రాజెక్టు కోసం అక్షయ్‌తో కలిసి పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.