టాలీవుడ్‌పై ఇల్లీ బేబీ ఆరోపణలు.. మండిపడుతున్న ప్రేక్షకులు

| Edited By:

Jul 29, 2020 | 8:42 PM

సుశాంత్‌ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోన్న పదం నెపోటిజం. బయటివారిని బాలీవుడ్‌లో తక్కువగా చూస్తారని, వారికి అవకాశాలు లేకుండా చేస్తారని చాలా మంది గళం విప్పుతున్నారు.

టాలీవుడ్‌పై ఇల్లీ బేబీ ఆరోపణలు.. మండిపడుతున్న ప్రేక్షకులు
Follow us on

Ileana comments on Tollywood: సుశాంత్‌ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోన్న పదం నెపోటిజం. బయటివారిని బాలీవుడ్‌లో తక్కువగా చూస్తారని, వారికి అవకాశాలు లేకుండా చేస్తారని చాలా మంది గళం విప్పుతున్నారు. అంతేకాదు ఓ గ్యాంగ్‌ బాలీవుడ్‌ మొత్తాన్ని ఏలుతుందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్‌పై గోవా బ్యూటీ ఇలియానా సంచలన కామెంట్లు చేశారు.

టాలీవుడ్‌ మొత్తాన్ని నెపోజిటం నడిపిస్తుందని ఇల్లీ బ్యూటీ ఆరోపణలు చేశారు. అంతేనా.. కొత్త వారు, బయటి నుంచి వచ్చిన వారు అక్కడ ఎదగడం కష్టమంటూ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి ఇక్కడ అవకాశాలు లేకపోతే నువ్వేలా టాప్ హీరోయిన్‌ అయ్యావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే నిజానికి చెప్పాలంటే ఇలియానాకు ఎక్కువ అవకాశాలు లభించినది టాలీవుడ్‌లోనే. ఇక్కడ ఆ బ్యూటీకి ప్రేక్షకులు గొప్ప స్థానాన్ని ఇచ్చారు. అంతేకాదు ఒకానొక సమయంలో ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసినప్పటికీ.. పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. అంతేనా.. సెకండ్ ఇన్నింగ్స్ ఆఫర్‌ కూడా ఇచ్చింది. అలాంటి టాలీవుడ్‌పై ఇలియానా ఈ కామెంట్లు చేయడం ప్రేక్షకలకు కోపాన్ని తెప్పిస్తోంది. దీంతో ఆమెపై ట్రోలింగ్‌ మొదలెట్టారు. మరి ఈ వ్యాఖ్యలకు ఇలియానా ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

Read This Story Also: ఫ్లూ టీకాతో తగ్గనున్న ఆ రెండు జబ్బులు