డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంపై టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలేవరూ గూడు లేకుండా ఉండకూడదన్నసీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగానే పథకం అమలు దిశగా అధికార యంత్రాంగం పని చేస్తున్నామని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పేదలు గౌరవంగా బతకాలనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సిఎం ప్రణాళిక రూపొందించారని చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రూ. […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంపై టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలేవరూ గూడు లేకుండా ఉండకూడదన్నసీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగానే పథకం అమలు దిశగా అధికార యంత్రాంగం పని చేస్తున్నామని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పేదలు గౌరవంగా బతకాలనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సిఎం ప్రణాళిక రూపొందించారని చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రూ. 5 కోట్ల 8 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన 80 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకే ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.