సర్వరోగ నివారిణి..‘దూద్‌బావి’ నీళ్లు..ఎక్కడుందో తెలుసా..?

‘దూద్‌బావి’ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాతన మంచినీటి బావి..ఇందులో నీరు చాలా స్పష్టంగా ఉంటాయి. నోట్లో పోసుకుంటే తీయగా ఉంటుందట. దాహం వేసిన వారు వెంటనే ఓ అరలీటర్ నీటిని తాగేస్తారట. అంతేకాదు..ఏళ్ల నుంచి అక్కడి బావి నీటికి మరో విశిష్టత కూడా ఉంది. ఆ నీరు తాగితే సర్వరోగాలు తొలగిపోతాయని అక్కడి స్థానికుల విశ్వాసం. అయితే, ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలోనూ అక్కడి బావి నీళ్లు ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అంతటి ప్రాముఖ్యతల గల బావి […]

సర్వరోగ నివారిణి..‘దూద్‌బావి’ నీళ్లు..ఎక్కడుందో తెలుసా..?
Follow us

|

Updated on: Aug 01, 2020 | 3:27 PM

‘దూద్‌బావి’ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాతన మంచినీటి బావి..ఇందులో నీరు చాలా స్పష్టంగా ఉంటాయి. నోట్లో పోసుకుంటే తీయగా ఉంటుందట. దాహం వేసిన వారు వెంటనే ఓ అరలీటర్ నీటిని తాగేస్తారట. అంతేకాదు..ఏళ్ల నుంచి అక్కడి బావి నీటికి మరో విశిష్టత కూడా ఉంది. ఆ నీరు తాగితే సర్వరోగాలు తొలగిపోతాయని అక్కడి స్థానికుల విశ్వాసం. అయితే, ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలోనూ అక్కడి బావి నీళ్లు ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అంతటి ప్రాముఖ్యతల గల బావి ఎక్కడో కాదు.. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలోని ‘దూద్‌బావి’ ఎన్నో ఏళ్ల చరిత్ర గలది. మొలంగూర్లో సైనికుల కోసం కాకతీయ రాజులు ఈ బావిని తవ్వించారట. ఈ బావి నీరు చాలా తీయగా, స్వచ్ఛంగా ఉంటాయి. అంతేకాదు, ఏ కాలం అయిన సరే బావి జలతో నిండుకుండలా ఉంటుంది. ఈ నీళ్లలో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఏ మాత్రం కనపడవు. అప్పట్లో ఈ నీళ్లను గుర్రపు బగ్గీల్లో హైదరాబాద్‌లోని నిజాం నవాబు కుటుంబానికి సరఫరా చేసేవారని చరిత్ర చెబుతోంది. కాగా, ఇప్పటికీ చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు చాలా మంది ఇక్కడ్నుంచి నీటిని తీసుకువెళ్తుంటారు.

ఈ బావికి చుట్టుపక్కల మర్రి చెట్లు, చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు.. రాతి గోడలు ఉండడం విశేషం. దూద్‌బావిలోని పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు తాగితే సర్వ రోగాలు తొలగిపోతాయనేది స్థానికుల నమ్మకం. ఈ బావి నీళ్లకు ప్రత్యేకత ఉండడంతో ఏళ్ల తరబడి చాలా మంది ఇవే నీటిని తాగుతూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నీటిలో ఖనిజ లవణాలు మెండుగా ఉండడంతో ఈ నీటిని తాగిన వారికి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఈ నీళ్లను పరీక్షించిన ప్రభుత్వం..వీటిలో స్వచ్ఛమైన అధిక లవణాలు పోషక పదార్థాలు చాలా ఉన్నాయని గుర్తించారు. అప్పటి నుంచి ఈ గ్రామస్తులే కాకుండా ఇతర జిల్లా వాసులు కూడా ఈ నీటిని తీసుకెళ్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజలందరినీ వణికిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి కూడా బయటపడేందుకు దూద్‌బావి నీరు ఉపకరిస్తుందని అక్కడి వారు నమ్ముతున్నారు. దీంతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి దూద్‌బావి నీటి కోసం బారులు తీరుతున్నారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..

పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది

టీచర్‌కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు

పుట్టినరోజు వేడుకలో విషాదం..ఈతకెళ్లిన విద్యార్థులు గల్లంతు

పెళ్లి ఇంట విషాదం…మూడో రోజే నవ వధువు ఆత్మహత్య

ఈ మేకలను బలిస్తే రక్తం రాదట..!

విశాఖ షిప్ యార్డ్‌లో కూలిన భారీ క్రేన్..10 మంది మృతి..