ఓన్లీ రష్మిక.. నో కళ్యాణి.. డైరెక్టర్ క్లారిటీ
నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కునున్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు డైరెక్టర్. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నిన్నటి నుంచి ఈ సినిమాలో రష్మిక తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి. దానితో ఈ వార్తలపై డైరెక్టర్ వెంకీ కుడుములు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సినిమాలో రష్మిక […]
నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కునున్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు డైరెక్టర్. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నిన్నటి నుంచి ఈ సినిమాలో రష్మిక తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి. దానితో ఈ వార్తలపై డైరెక్టర్ వెంకీ కుడుములు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఈ సినిమాలో రష్మిక మాత్రమే హీరోయిన్ అని సెకండ్ హీరోయిన్ లేదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే సినిమాలో నటించే నటీనటులందరినీ ప్రకటిస్తామని తెలిపారు. అటు ఈ రూమర్స్ పై కళ్యాణి కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘కొద్ది రోజులు రూమర్స్ ఆపండి. త్వరలోనే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానని’ ఆమె తెలిపారు.
Rashmika Mandanna is the only female lead in Nithin starrer #Bheeshma produced under Sithara entertainments ! Cast and crew details vl announce soon ???@actor_nithiin @iamRashmika @vamsi84 @SitharaEnts
— Venky Kudumula (@VenkyKudumula) April 16, 2019
Can the rumour mill stay calm, I shall announce details of my next soon ??#keepcalmandwait
— Kalyani Priyadarshan (@kalyanipriyan) April 16, 2019