కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్

ఈ వైరస్ భయంతోనే కరోనా అనుమానితుడు తన్వీర్ సింగ్ (35) ఎస్‌ఎస్బీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్‌ జిల్లాలోని సియానా గ్రామానికి చెందిన..

కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2020 | 4:23 PM

కరోనా వచ్చిందనే.. భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భారత దేశ రాజధాని ఢిల్లీలో చేటుచేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు భారత దేశ ప్రజలను కూడా కరోనా టెన్షన్ వెంటాడుతోంది. దీని కారణంగా ఇండియాలో 150కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ వైరస్ భయంతోనే కరోనా అనుమానితుడు తన్వీర్ సింగ్ (35) ఎస్‌ఎస్బీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్‌ జిల్లాలోని సియానా గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన్వీర్‌ను.. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని సిబ్బంది కరోనా స్క్రీనింగ్ చేశారు. అయితే అతడిని కరోనా అనుమానితుడిగా భావించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. ఆస్పత్రికి తరలించారు.

ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డులో అతడిని ఉంచి, వైద్యం అందిస్తున్నారు. అలాగే అతని బంధువులకు కూడా సమాచారం అందించారు. కాగా.. ఈ రోజు ఉదయం ఎవరూ ఊహించని విధంగా తన్వీర్ సింగ్ ఆస్పత్రిలోని 7వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఆ మృతదేహాన్ని ఎవరూ ముట్టుకోవద్దని.. తగిన వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత కుటుంబసభ్యులకు అందిస్తామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం తన్వీర్ సింగ్ సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

Read More this also: 

పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

నాగబాబు గురించి హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..