Death Mystery: ఆ ప్రాంతంలో వరుసగా చనిపోతున్న పిల్లులు.. పోలీసుల రాకతో బయటపడ్డ సంచలన విషయాలు!

|

Jul 22, 2021 | 1:59 PM

హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతంలో మూగ జీవాల మృతదేహాలు కలకలం రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో పిల్లులు మృత్యువాతపడ్డాయి.

Death Mystery: ఆ ప్రాంతంలో వరుసగా చనిపోతున్న పిల్లులు.. పోలీసుల రాకతో బయటపడ్డ సంచలన విషయాలు!
Cats Died
Follow us on

Serial Cats Dead in Hyderabad: హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతంలో మూగ జీవాల మృతదేహాలు కలకలం రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో పిల్లులు మృత్యువాతపడ్డాయి. వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఇద్దరు మహిళలు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ హైదాబాద్ పరిధిలోని గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన స్ల్పెండిడ్‌ అపర్ణ ఫామ్‌ డోస్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అనిత పీటర్స్‌, అనిషా చౌదరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విల్లా నంబర్‌ 132 సమీపంలో మూగజీవాలు (పిల్లులు) చనిపోయి ఉండడాన్ని పలుమార్లు చూశారు. వాటిని తీవ్రంగా గాయపరిచి రెండు కాళ్లు తాళ్లతో కట్టి హింసాత్మకంగా చంపుతున్నట్లు గుర్తించారు. దీంతో వారు మంగళవారం పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన పిల్లులను పుండూరుకు చెందిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం చేపట్టారు. వరుసగా మూగజీవాలు మృత్యువాత పడడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు, ఎందుకు చంపుతున్నారనే అంశాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు.

Read Also…  Viral Video: పార్లమెంట్‌ సభలో ఊహించని సంఘటన.. నేతలు పరుగో పరుగు.. వైరల్ వీడియో.!