చిత్రపరిశ్రమలో విషాదం..మరో నటుడు ఆత్మహత్య

ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో కొందరు, మానసిక ఒత్తిడిని జయించలేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన మరువకముందే

చిత్రపరిశ్రమలో విషాదం..మరో నటుడు ఆత్మహత్య
Follow us

|

Updated on: Jul 30, 2020 | 10:14 AM

ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో కొందరు, మానసిక ఒత్తిడిని జయించలేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన మరువకముందే మరాఠీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందెడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరాఠీ నటుడు అశుతోష్ భక్రే ఉరివేసుకొని ప్రాణాలు తీసున్నాడు. నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో గల తన ఇంట్లోనే అశుతోష్ భక్రే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే అశుతోష్ భక్రే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది తెలియాల్సి ఉంది.

అశుతోష్ భక్రే.. భకార్, ఇచర్ థార్లా పక్కా వంటి పలు సినిమాల్లో నటించాడు. ఆయన భార్య కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. భక్రే భార్య మయూరి దేశ్ ముఖ్ పలు మరాఠీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.  నెల రోజుల క్రితమే అతడు నాందెడ్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని.. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని సన్నిహితులు భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read More: వర్మకు మరోషాక్…సీఈసీ భారీ జరిమానా