Divorce: ఆ వెబ్‌సైట్లలో ప్రొఫైల్ అప్‌లోడ్ చేసిన భార్య.. విడాకులు కోరిన భర్త.. ఔరంగాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

|

Aug 28, 2021 | 9:55 PM

బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఔరంగాబాద్‌కు చెందిన వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది.

Divorce: ఆ వెబ్‌సైట్లలో ప్రొఫైల్ అప్‌లోడ్ చేసిన భార్య.. విడాకులు కోరిన భర్త.. ఔరంగాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
Nagpur High Court Bench
Follow us on

High Court Grants Divorce: బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఔరంగాబాద్‌కు చెందిన వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. అకోలాలోని ఫ్యామిటీ కోర్టు ముందు విడాకుల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రెండో వివాహం కోసం అతని భార్య మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసింది. తన ప్రొఫైల్‌లో.. ఆ మహిళ తాను “విడాకుల కోసం ఎదురుచూస్తున్నాను” అని పేర్కొంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న నాగపూర్ హైకోర్టు భర్తతో విడాకులు మంజూరు చేసింది.

న్యాయమూర్తులు AS చందూర్కర్, GA సనప్‌ లతో కూడిన డివిజన్ బెంచ్.. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది. ప్రొఫైల్ అప్‌లోడ్ చేయడం వలన ఆమె “తన విడిపోయిన భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది” . తన భర్తతో విడాకులు తీసుకోవాలని బలంగా నిర్ణయం తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చినట్లు కోర్టు భావించింది. తన ప్రొఫైల్‌ని రెండు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడం ద్వారా ఆమె ఉద్దేశం పెద్దదిగా మారింది” అని కోర్టు పేర్కొంది. “దీంతో ఆమె అప్పీలుదారుడు అయిన భర్తను వదిలించుకోవాలని, రెండవ వివాహం చేసుకోవాలనుకున్నట్లు భావించాల్సి వస్తుందని” కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తున్న ధర్మాసనం పేర్కొంది.high court ,divorce ,aurangabad ,man, wife ,matrimonial sites, nagpur high court bench

ఈ జంట జూలై 2014 లో వివాహం చేసుకున్నారు. వీరు వివాహం అనంతరం పంజిమ్‌లో నివసించడం ప్రారంభించారు. కానీ, వెంటనే ఆ మహిళ పంజిమ్‌లో తనకు అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడం ప్రారంభించింది. తన భర్త తన ఉద్యోగాన్ని వదులుకుని అకోలాకు మారాలని పట్టుబట్టింది. అందుకు భర్త నిరాకరించాడు. దీంతో ఇద్దరు మధ్య విభేదానికి దారితీసింది. వారి వివాహం జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత, ఏప్రిల్ 2015 లో, భార్య పోటీ పరీక్షకు సిద్ధపడటానికి పంజిమ్‌ను విడిచిపెట్టింది. ఆ తరువాత ఆమె తన వ్యక్తిగత వస్తువులన్నింటినీ తన వెంట తీసుకువెళ్లింది. అయితే, తిరిగి రావల్సిందిగా, భర్త ఎన్నిసార్లు కోరిన ప్రయోజనం లేకపోయింది. దీంతో విడాకుల కోసం భర్త అకోలాలోని కుటుంబ కోర్టును ఆశ్రయించాడు.

అయితే, డిసెంబర్ 7, 2020 న, విడాకుల కోసం భర్త వేసిన పిటిషన్‌ను కుటుంబ కోర్టు కొట్టివేసింది. కానీ, క్రూరత్వం కారణంగా అతనికి న్యాయపరమైన విభజనను మంజూరు చేసింది. అనంతరం భర్త హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో న్యాయమూర్తులు AS చందూర్కర్, GA సనప్‌ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎట్టకేలకు ధర్మసనం అతనికి విడాకులు మంజూరు చేసింది.

వరకట్నం డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైనందుకు వేధింపులకు గురైందని, చివరికి ఇంటి నుంచి తరిమికొట్టాడని మహిళ ప్రతివాదనలను నమ్మడానికి హైకోర్టు నిరాకరించింది. మహిళ ప్రవర్తన ఆమె చెప్పిన వాస్తవాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు ధర్మాసనం నిర్ధారణకు వచ్చింది. విధేయురాలైన భార్యగా, కోడలుగా ఆమె తన విధులను నిజాయితీగా నిర్వర్తించలేదని కోర్టు నిర్ణయానికి వచ్చింది. కానీ, ఆమె భర్త, అత్తమామలు ఆమెను ఇష్టపడలేదు. వారు తనను వదిలించుకోవాలని చూశారని ఆమె తరుఫున వాదనలు వినిపించారు న్యాయవాదులు.

మహిళకు తన భర్తతో ఉండాలనే కోరిక లేదని సాక్ష్యాలు స్పష్టంగా సూచిస్తున్నాయని బెంచ్ తెలిపింది. “ప్రతివాదికి తన వివాహాన్ని కాపాడాలనే హృదయపూర్వక కోరిక ఉంటే, విడాకుల పిటిషన్ తుది ఫలితం రాకముందే ఆమె రెండవ వివాహం చేసుకునే ఉద్దేశపూర్వక నిర్ణయం తీసుకోలేదు” అని బెంచ్ తెలిపింది. ఆ మహిళ పంజిమ్, అకోలా పోలీసులతో పాటు ఆమె భర్త యజమానికి ఫిర్యాదు చేసినట్లు హైకోర్టు గుర్తించింది. ఆమె అతనిపై మద్దతు లేని ఆరోపణలు చేసింది. మహిళ తన భర్త జీవితాన్ని దుర్భరంగా మార్చిందని, అందువల్ల హైకోర్టు అతనికి విడాకులు ఇచ్చే అర్హత ఉందని కోర్టు పేర్కొంది.

Read Also…  ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఆగండి.. మీ పాత పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేయండి.. ఫుల్ ఛార్జ్‌లో 65 కిమీ.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?