దేశంలో 70 వేల మార్క్‌ను దాటిన క‌రోనా కేసులు

భార‌త్ క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న వైర‌స్ కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. తాజాగా మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి కేసుల సంఖ్య 70వేల మార్క్‌ను దాటింది.

Follow us

|

Updated on: May 12, 2020 | 10:03 AM

భార‌త్ క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న వైర‌స్ కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. తాజాగా మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి కేసుల సంఖ్య 70వేల మార్క్‌ను దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 70,756 కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది.  అందులో 46, 008 మంది యాక్టివ్ కేసులు ఉండ‌గా, 22,455 మంది కోలుకున్నారు. అటు మృతుల సంఖ్య 2,293కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,604 కేసులు న‌మోదు కాగా 87 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి.