మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

| Edited By:

Aug 13, 2020 | 10:09 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11,813 కరోనా పాజిటివ్‌ కేసులు..

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
Follow us on

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,60,126కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 3,90,958 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,49,798 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై, పూణె, థానే నగరాల్లోనే నమోదవుతున్నాయి.

కాగా, దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి నమోదవుతున్నాయి.