కరోనా లాక్ డౌన్.. ఏపీ హైకోర్టు మరో కీలక నిర్ణయం..

Coronavirus Outbreak: కరోనా రోగులకు రాత్రింబవళ్ళు సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని కొన్ని చోట్ల ఇళ్లు ఖాళీ చేయాలంటూ యజమానులు బెదిరిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక దీనిపై తాజాగా ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన […]

కరోనా లాక్ డౌన్.. ఏపీ హైకోర్టు మరో కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Apr 11, 2020 | 8:28 AM

Coronavirus Outbreak: కరోనా రోగులకు రాత్రింబవళ్ళు సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని కొన్ని చోట్ల ఇళ్లు ఖాళీ చేయాలంటూ యజమానులు బెదిరిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక దీనిపై తాజాగా ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు పీపీఈలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని, అంతేకాకుండా తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు మార్కెట్లు, రైతు బజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెల్స్ ఏర్పాటు చేసే అంశంపై వారం రోజుల్లో నివేదికను సమర్పించాలని తెలిపింది. అటు బహిరంగ ప్రదేశాలు, మార్కెట్ల వద్ద ప్రజలు సామాజిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఇది చదవండి: కరోనా వేళ.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్…