చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్పై బీహార్లో కేసు నమోదయ్యింది. చైనా ప్రెసిడెంట్పై భారత్లో కేసు పెట్టడం ఏంటని అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే. బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా కోర్టులో కేసు నమోదు చేశారు. కొవిడ్-19 వ్యాప్తికి డ్రాగన్ కంట్రీని సూత్రధారిగా చేస్తూ.. ఆ దేశాధ్యక్షుడు జి జిన్పింగ్తోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్పై కూడా కోర్టులో కేసు పెట్టారు. బీహార్కు చెందిన న్యాయవాది మురాద్ అలీ స్థానిక కోర్టులో వీరిద్దిరై ఫిర్యాదు చేశారు. ఈ కేసు జూన్ 16వ తేదీన విచారణకు రానుంది.
పిటిషన్లో చైనా వైరస్ వ్యాప్తి చేసిందనడానికి సాక్షులుగా రెండు దేశాల అధినేతలను చూపించారు. వారిలో ప్రధాన సాక్షులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీలను పేర్కొన్నారు. ఐపీసీ 269, 270, 302, 307, 500, 504, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే..2019 డిసెంబర్లో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి.. మన దేశంలో మరణ మృదంగం మోగిస్తోంది.