హమ్మయ్యా …కోలుకున్నాం..! అంతా వారి ప్రార్థనలతోనే..

కరోనా భయంతో క్వారంటైన్‌కు వెళ్లిన బోనీ కపూర్‌ ఫ్యామిలీ సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేసుకొని బయటకు వచ్చింది. బోనీ కపూర్‌తో పాటు ఆయన కూతుర్లు జాన్హవి, ఖుషిలు ముగ్గురు కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

హమ్మయ్యా ...కోలుకున్నాం..! అంతా వారి ప్రార్థనలతోనే..
Follow us

|

Updated on: Jun 05, 2020 | 5:52 PM

కరోనా భయంతో క్వారంటైన్‌కు వెళ్లిన బోనీ కపూర్‌ ఫ్యామిలీ సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేసుకొని బయటకు వచ్చింది. బోనీ కపూర్‌తో పాటు ఆయన కూతుర్లు జాన్హవి, ఖుషిలు ముగ్గురు కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు, గైడ్‌లైన్స్‌ మేరకు బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు.  వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటీవ్‌ రావడంతో ఫ్యామిలీ మొత్తం ఊపిరి పీల్చుకుంది.

ముంబైలోని బోనీ కపూర్‌ ఇంటిలో పని చేసే స్టాఫ్‌లో ముగ్గురికి 15 రోజుల క్రితం కరోనా టెస్టుల్లో పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో ఉలిక్కి పడ్డ బోనీ కపూర్‌ ఫ్యామిలీ కరోనా టెస్టుల తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో తమ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

View this post on Instagram

Staying at home is still the best solution we have. Stay safe everyone ??

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on