షాకింగ్.. గాంధీ ఆసుపత్రి నుంచి పరారైన కరోనా బాధితుడు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ఓ బాధితుడు ఆసుపత్రి నుంచి పరారవ్వడం కలకలం రేపుతోంది. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని గాంధీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ఓ బాధితుడు ఆసుపత్రి నుంచి పరారవ్వడం కలకలం రేపుతోంది. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నుంచి పారిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుడి ఆచూకీ కోసం నగరంలోని చిలకలగూడ పోలీసులతో పాటు.. గద్వాల పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అతడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్దారణ కావడంతో ఇటీవలే గద్వాల నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 330ను దాటేసింది. 11 మంది మృత్యువాత పడగా.. 33 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు షాక్.. భారీగా ఉద్యోగాల కోత తప్పదా..!