కరోనా కాలంలో జగన్ సంచలనం.. వారికి రూ. 5 వేలు సాయం..
కరోనా నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు గడపదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు అన్ని మూతపడ్డాయి. విద్యా,వ్యాపార, రవాణా వ్యవస్థలు స్థంబించిపోయాయి. ఆఖరుకు దేవాలయాలు, మసీదులు, చర్చ్లకు కూడా తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు శుభవార్త అందించింది. లాక్ డౌన్ నేపధ్యంలో వీరికి రూ. 5 వేల ఆర్ధిక సాయం అందించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది. […]
కరోనా నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు గడపదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు అన్ని మూతపడ్డాయి. విద్యా,వ్యాపార, రవాణా వ్యవస్థలు స్థంబించిపోయాయి. ఆఖరుకు దేవాలయాలు, మసీదులు, చర్చ్లకు కూడా తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు శుభవార్త అందించింది. లాక్ డౌన్ నేపధ్యంలో వీరికి రూ. 5 వేల ఆర్ధిక సాయం అందించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్..
ఈ డబ్బును నేరుగా అర్హులైన వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయాలని పేర్కొంది. ప్రభుత్వం, సంబంధిత మత సంస్థల నుంచి జీతం/ ఉపకార వేతనం తీసుకునే వారు మాత్రం అనర్హులని స్పష్టం చేసింది. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తీవ్రత కొనసాగుతోంది. తాజాగా 24 గంటల్లోనే ఏపీలో రికార్డు స్థాయిలో 75 పాజిటీవ్ కేసులు నమోదు కాగా, ఇటు తెలంగాణలో 14 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Also Read:కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..