ఆల్‌టైమ్ హై రికార్డుకు చేరుకున్న బంగారం.. లేటెస్ట్ ధర రూ.50,950

కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధర పరుగులు పెడుతుంది. గత కొద్ది రోజుల నుంచి హెచ్చుదగ్గులకు లోనవుతున్న బంగారం ధర ఈ రోజు హై రేటుకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. దీంతో ప్రజలు పసిడి కొనాలంటేనే...

ఆల్‌టైమ్ హై రికార్డుకు చేరుకున్న బంగారం.. లేటెస్ట్ ధర రూ.50,950
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 6:57 PM

కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధర పరుగులు పెడుతుంది. తాజాగా ఆల్‌టైమ్ హై రికార్డకు చేరుకుంది పసిడి. గత కొద్ది రోజుల నుంచి హెచ్చుదగ్గులకు లోనవుతున్న బంగారం ధర ఈ రోజు హై రేటుకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. దీంతో ప్రజలు పసిడి కొనాలంటేనే భయపడుతున్నారు. అందులోనూ ప్రస్తుతం ఆషాఢ మాసం కనుక బంగారం రేటు తగ్గుతుందోమోనని పసిడి ప్రియులు ఎదురు చూస్తుంటే.. వారికి షాక్ ఇస్తూ హై రేటుకు చేరుకుంది. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర రూ.50,950కి చేరుకుంది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.46,740గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.48,750గా ఉంది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.47,550గా రికార్డు క్రియేట్ చేసింది.

Read More: 

జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో.. స్కూల్‌ ఏజ్‌లోనే అదరగొట్టాడు..

పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..