దూమారం రేపుతున్న చింతమనేని సంచలన వ్యాఖ్యలు..!

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదంలో చిక్కుకున్నారు. దళితులను అసభ్య పదజాలంతో దూషిచారంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ‘మీరు దళితులు… మీకెందుకు రా రాజకీయాలు’ అంటూ చింతమనేని దూషించిన ఈ వీడియో ని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. గత నెల శ్రీరామవరం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇటు దళిత సంఘాలు, అటు వైసీపీ నేతలు […]

దూమారం రేపుతున్న చింతమనేని సంచలన వ్యాఖ్యలు..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:54 PM

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదంలో చిక్కుకున్నారు. దళితులను అసభ్య పదజాలంతో దూషిచారంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ‘మీరు దళితులు… మీకెందుకు రా రాజకీయాలు’ అంటూ చింతమనేని దూషించిన ఈ వీడియో ని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. గత నెల శ్రీరామవరం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇటు దళిత సంఘాలు, అటు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలో ధర్నాకు దిగిన నేతలు అధికార పార్టీ వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలని… చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దళిత సంఘాలకు వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు.

మరోవైపు చింతమనేని ధర్నా:

ఇటు చింతమనేని ప్రభాకర్ కూడా వారికి పోటీగా ఆయన అనుచరులతో ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని… తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని ఆయన అన్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. అలాగే ఆయన వైసీపీ ఆ వీడియో ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని జిల్లా ఎస్.పి కి కూడా ఫిర్యాదు చేశారట.