Telugu News Education Career Jobs JEE Main 2025 Session 2 Exam Day Guidelines: Over 60 percent of students from Session 1 reappearing for Session 2
JEE Main 2025 Session 2 Exam: జేఈఈ మెయిన్ 2025 పరీక్ష రాసేవారికి ‘డ్రెస్ కోడ్’ ఆంక్షలు..
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్టీయే ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు పలు ముఖ్య సూచనలు జారీ చేసింది..
హైదరాబాద్, మార్చి 27: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 8వ తేదీన పరీక్ష మొదటి షిఫ్టులో మాత్రమే జరగనుంది. అలాగే ఏప్రిల్ 9న పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్-2బి (బిప్లానింగ్, పేపర్ 2ఎ, బి (బీఆర్క్, బి ప్లానింగ్) పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరగనుంది. ఇక ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఇప్పటికే అందుబాటులో తీసుకురాగా.. తాజాగా జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు కూడా ఎన్టీయే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు పలు ముఖ్య సూచనలు జారీ చేసింది. విద్యార్ధుల డ్రెస్ కోడ్పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రతి తప్పు ప్రశ్నకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. అందుకే ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జవాబులు గుర్తించాలి.
జేఈఈ అభ్యర్థులు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే..
పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం సెషన్లో 8.30, మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటలకే గేట్లు మూసి వేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. ఉదయం 7.30 నుంచి 8.30, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్య పరీక్షా కేంద్రాల్లోకి అనుమాతిస్తారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
ఆధార్, పాస్పోర్ట్, రేషన్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు (ఐడెంటిటీ) కార్డు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.
రెండు పాస్పోర్టుసైజ్ ఫొటోలు, ట్రాన్స్పరెంట్ పెన్ను, అడ్మిట్ కార్డును మాత్రమే అనుమతిస్తారు. బీఆర్క్ పరీక్షకైతే పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెంట్రీ బాక్స్ తీసుకెళ్లవచ్చు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు స్కార్ఫ్లు, మఫ్లర్లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్ళద్దాలు ధరించరాదు.
పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి.
దుస్తులపై మెటాలిక్స్ అలంకారాలు ఉంటే అనుమతించరు. బూట్లు, మందమున్న చెప్పులు వేసుకోకూడదు.
లోహాలతో కూడిన వస్తువులు, ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి. ఉంగరాలు, గాజులు వేసుకోకుంటే మంచిది.