
అమరావతి, సెప్టెంబర్ 13: గ్రూప్ 1లో తొలుత 149 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే వయోజన విద్య సహాయ సంచాలకులు/ప్రాజెక్టు అధికారి పోస్టులు 4, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులు 14 ఆ జాబితాలో లేవు. వీటిని కూడా కలిపి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉండటంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్-1 పోస్టుల జాబితాలో కొన్ని మార్పులు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోస్టుల కేడర్, జోన్లకు సంబంధించిన సాంకేతిక సమస్యలు దాదాపుగా పరిష్కారమైనట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల జాబితాలో పలు మార్పులు చేశారు.
గ్రూప్-1తో పాటు ఇతర ఉద్యోగాల భర్తీలో 2026 జూలై 1 నాటికి ఉన్న వయస్సును పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు వన్టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవచ్చు. ఇప్పటికే OTR ఉన్నవారు కొత్తగా సాధించిన అదనపు అర్హతలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
గ్రూప్-1, గ్రూప్-2 నియామక పరీక్షలను మాన్యువల్ విధానంలో నిర్వహించాలని APPSC నిర్ణయించినట్లు సమాచారం. మిగతా నియామక పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆన్లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ అమలుపై నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది. ఆన్లైన్ విధానంతో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి సమస్యలకు అవకాశం తగ్గుతుందని కమిషన్ భావిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం 26 జిల్లాల ప్రాతిపదికన ఆరు జోన్లు, రెండు మల్టీజోన్ల విధానం అమల్లోకి వచ్చింది. ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు, మిగిలిన 5 శాతం ఓపెన్ కేటగిరీకి కేటాయించే విధానం అమల్లో ఉంటుంది. పోలీసు నియామకాలను మినహాయించి APPSC ద్వారా భర్తీ చేయనున్న ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలను కూడా సెప్టెంబర్ 15న విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (VAS) క్లాస్-ఏ పోస్టులను కూడా APPSC ద్వారానే భర్తీ చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థులు సెప్టెంబర్ 15న విడుదలయ్యే షార్ట్ నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల సంఖ్య, దరఖాస్తు తేదీలు, పరీక్షల షెడ్యూల్ తదితర వివరాలను తెలుసుకోవచ్చు.
గ్రూప్-1లో భర్తీ చేసే ఉద్యోగాలు