
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 206-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (ఈఏపీసెట్) పూర్తి నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్టీయూకే) నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 7 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఏపీ ఈఏపీసెట్ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఎస్సీ (అగ్రి)/ బీఎస్సీ (హార్జికల్చర్)/ బీవీఎస్సీ & ఏహెచ్/ బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.700, బీసీ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ఏపీ ఈఏపీసెట్ 2026 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.