సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ రెడిట్ కో ఫౌండర్, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ భర్త అలెక్సిస్ ఒహానియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని సంస్థకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇంత జరుగుతున్నా నువ్వు ఏం చేస్తున్నావు అని భవిష్యత్తులో నా కుమార్తె ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అందుకే తను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఒహానియాన్ తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన వస్తోంది. జాతి విద్వేషాలను అరికట్టడమే కాకుండా నల్లజాతి సమాజానికి సేవ చేయడానికి సంస్థలో తన వాటాపై భవిష్యత్తులో వచ్చే లాభాలను ఉపయోగించుకుంటానని ప్రకటించారు.
జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంపై అమెరికాలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒహానియాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక మాజీ ఎన్ఎఫ్ఎల్ స్టార్ కోలిన్ కైపెర్నిక్ యొక్క ‘నో యువర్ రైట్స్’ క్యాంప్కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
I believe resignation can actually be an act of leadership from people in power right now. To everyone fighting to fix our broken nation: do not stop.https://t.co/LWI1OnCaVi
— Alexis Ohanian Sr. ? (@alexisohanian) June 5, 2020