
ఆన్లైన్లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి కొత్త నియమం అమల్లోకి వచ్చింది. ఉదయం ఆన్లైన్ టికెట్ బుకింగ్లకు ఆధార్ ధృవీకరణను భారతీయ రైల్వే తప్పనిసరి చేసింది. IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ ధృవీకరణ చేయాలి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం, టౌట్లు లేదా బల్క్ బుకింగ్ ప్రభావాన్ని అరికట్టడం ఈ నిర్ణయం లక్ష్యం. నిజమైన ప్రయాణీకులకు ప్రయోజనం చేకూర్చడానికి, మోసపూరిత టికెట్ బుకింగ్ను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం.. ఆధార్తో IRCTC ఖాతా ధృవీకరించబడిన వినియోగదారులు మాత్రమే టికెట్ బుకింగ్ మొదటి రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. ఈ నియమం అక్టోబర్ 28, 2025 నుండి అమలులోకి వచ్చింది. అయితే PRS కౌంటర్లలో టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేదు. అయితే బల్క్ బుకింగ్ను నిరోధించడానికి టికెట్ అమ్మకాల మొదటి 10 నిమిషాల వరకు అధీకృత ఏజెంట్లకు బుకింగ్ పరిమితులు కొనసాగుతాయి. గతంలో తత్కాల్ టికెట్ బుకింగ్, మొదటి 30 నిమిషాలకు ఆధార్ ధృవీకరణను రైల్వేలు తప్పనిసరి చేశాయి. ఈ దశలన్నీ టికెట్ బుకింగ్ను నిష్పాక్షికంగా, పారదర్శకంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
IRCTC లో ఆధార్ ధృవీకరణ ఎలా చేయాలి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి