Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు
Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు
Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గుతుంటే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు.
దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు బాగా పెరుగుతున్నాయి. నెల క్రితం 40వేల చేరువలో ఉన్న బంగారం ధరలు.. మళ్లీ 45 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై స్వల్పంగా పెరిగింది. బుధవారం 22 క్యారెట్ల తులం బంగారం.. 45,640 ఉండగా.. గురువారం రూ.45,650 ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎంత మేర పెరిగాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,820 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర 50,720 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,650 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,650 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,460 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,600 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,770 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,920 వద్ద ఉంది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తటస్థంగానే కొనసాగుతున్నాయి. నిన్నటి ధరలే ఈరోజు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,450 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,590 వద్ద కొనసాగుతోంది.
Also Read: