Gold Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!

గత రెండు మూడు రోజులుగా భారీ దిగొచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మంగళావారం గోల్డ్‌ రేట్లు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతోనే గోల్డ్‌ రేట్లు ధరల్లో మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ః

Gold Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే తగ్గినప్పుడు, బంగారం దిగుమతి ఖరీదైనదిగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో విధించిన టారిఫ్ సుంకాలు ఆగస్టు 1 నుంచి మళ్లీ అమల్లోకి రానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నారు.

Updated on: May 06, 2025 | 11:30 AM

బంగారం కొనాలనుకునే పసిడి ప్రయులకు అలర్ట్‌.. మీరు బంగారం కొనాలనుకుంటే కొనేయొచ్చు.. ఎందుకంటే గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. బంగారం రేట్లు మళ్లీ పెరిగేలోపే కొనాలనుకునే వాళ్లు కొనేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు. మంగళవారం బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,574లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,776లుగా ఉంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇళా ఉన్నాయి..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,910, 24 క్యారెట్ల ధర రూ.95,890 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల రేటు రూ.95,740 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740 గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా 4ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,760,, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది.

వెండి ధరలు..

గత కొన్ని రోజులుగా బంగారంతో పాటుగా వెండికి కూడా ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సిల్వర్‌ నగల కోసం మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున వినియోగించడంతో దానికి డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులుగా పెరుగూ వస్తున్న వెండి ఇవాళ కొంచెం తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పొల్చుకుంటే ఇవాళ వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాలతో పాటు ప్రధాన భారతీయ నగరాల్లో తాజా వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి వెండి ధర గ్రాము రూ.107.90లు కాగా, కిలో వెండి ధర రూ. 1,08,900లుగా ఉంది.

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,07,900

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,900

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,900

ముంబైలో రూ.96,900

బెంగళూరులో రూ.96,900

చెన్నైలో రూ.1,07,900 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..