
1958-59 సంవత్సరంలో అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీంతో దేశంలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానిగా ఘనత సాధించారు. ఆ సమయంలో ఆర్థిక శాఖ పీఎం నెహ్రూ వద్ద ఉండేది.

నెహ్రూ తర్వాత.. ఇందిరా గాంధీ కూడా ప్రధానమంత్రిగా బడ్జెట్ను సమర్పించారు. నిర్మలా సీతారామన్ కంటే ముందు బడ్జెట్ను సమర్పించి ఆర్థిక మంత్రి పదవిని నిర్వహించిన ఏకైక మహిళ ఇందిరా గాంధీనే..

దేశంలో అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా 6 సార్లు, ఉప ప్రధానిగా 4 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఒక సందర్భంలో తన పుట్టినరోజు రోజు నాడు కూడా మొరార్జీ దేశాయ్ బడ్జెట్ను సమర్పించారు.

2016లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారధ్యంలో సాధారణ బడ్జెట్ విషయంలో పెద్ద మార్పు వచ్చింది. అంతకుముందు రైల్వే బడ్జెట్ను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. అయితే.. ఆ రైల్వే బడ్జెట్ను రద్దు చేసి సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. దీంతో చిరకాల సంప్రదాయానికి తెరపడింది.

ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిలిచారు. అయితే.. నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి 1, 2022న బడ్జెట్ను సమర్పించనున్నారు.