వెస్ట్ బెంగాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. రోజుకు పదిహేను వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 1690 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,117కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని 21,415 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 23 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 1,023 మంది మరణించారు. ఈ విషయాన్ని వెస్ట్ బెంగాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 13,679 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇక కరోనా బారినపడ్డ వారు 59.29 శాతం కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.
కాగా దేశ వ్యాప్తంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా గురువారం నాటికి నమోదైన కేసుల సంఖ్య 9.68 లక్షలకు చేరింది. వీటిలో 6.12 మది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
West Bengal reported 1,690 new COVID-19 cases and 23 deaths in the last 24 hours, taking total number of cases to 36,117 including 21,415 recoveries and 1,023 deaths. Discharge rate in the state stands at 59.29 per cent: State Health Department pic.twitter.com/ujzoobvef8
— ANI (@ANI) July 16, 2020