జెరూసలెం : చంద్రునిపై అడుగుపెట్టబోతున్న తొలి ఇజ్రాయెల్ స్పేస్క్రాఫ్ట్ అంతరిక్షంలో తన మొదటి సెల్ఫీని తీసి భూమికి పంపించింది. భూమికి దాదాపు 20 వేల మైళ్ల(37 వేల కిలోమీటర్లు) దూరం నుంచి ఈ అద్భుతమైన ఫొటోను అది క్లిక్మనిపించింది. ఈ సెల్ఫీలో రోబోటిక్ లాండర్తోపాటు వెనుకభాగంలో వెలిగిపోతున్న భూమి స్పష్టంగా కనిపిస్తోంది.
బేర్షీట్ స్పేస్క్రాఫ్ట్ అంతరిక్షంలో తీసిన ఈ సెల్ఫీలో భూమిపై ఆస్ట్రేలియా భూభాగం స్పష్టం కనిపిస్తోందని మిషన్ బృంద సభ్యులు ఆ ఫొటోను పోస్టు చేస్తూ తెలిపారు. ఈ ఫొటోలో స్పేస్క్రాఫ్ట్పై ఇజ్రాయెల్ జాతీయ పతాకంతోపాటు.. ‘చిన్నదేశం.. పెద్ద కలలు’ అని రాసున్న సందేశం కూడా కనిపిస్తోంది.
ఇజ్రాయెల్కు చెందిన తొలి మూన్ లాండర్ను ఫ్లోరిడాలోని కేఫ్ కానవెరాల్ నుంచి రెండు వారాల క్రితం విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఏప్రిల్ 11న చంద్రునిపై దిగనుంది. 585 కిలోల బరువున్న ఈ స్పేస్క్రాఫ్ట్ను స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించారు. ఇప్పటివరకూ రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్క్రాఫ్టులు 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై దిగాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఈ దేశం కూడా చేరనుంది.