బాలాకోట్‌లో తీవ్రవాదులా..? ఎక్కడ..? మృతదేహాలేవి..?

| Edited By:

Mar 01, 2019 | 1:18 PM

చేధు జ్ఞాపకంగా 2019 ఫిబ్రవరి 14 భారతదేశంలోని అందరి మనసులను ఒక్కసారిగా ఆవేదనకు, ఆక్రోశానికి గురిచేసింది. పాకిస్తాన్ మన దేశంపై ఎదురుగా ఢీ కొనే తెగువ లేక ఆత్మహుతి దాడి చేపించింది. ఆ దాడిలో భారత జవానులు 49 మంది మరణించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ బాలకోట్‌పై ఎదురుదాడికి దిగింది. వాళ్ల లాగా దొంగ దెబ్బ కాకుండా ఎదురుగా వాళ్ల ముందుకు వెళ్లి దాడులు చేసింది. అయితే.. ఈ దాడిలో దాదాపు […]

బాలాకోట్‌లో తీవ్రవాదులా..? ఎక్కడ..? మృతదేహాలేవి..?
Follow us on

చేధు జ్ఞాపకంగా 2019 ఫిబ్రవరి 14 భారతదేశంలోని అందరి మనసులను ఒక్కసారిగా ఆవేదనకు, ఆక్రోశానికి గురిచేసింది. పాకిస్తాన్ మన దేశంపై ఎదురుగా ఢీ కొనే తెగువ లేక ఆత్మహుతి దాడి చేపించింది. ఆ దాడిలో భారత జవానులు 49 మంది మరణించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ బాలకోట్‌పై ఎదురుదాడికి దిగింది. వాళ్ల లాగా దొంగ దెబ్బ కాకుండా ఎదురుగా వాళ్ల ముందుకు వెళ్లి దాడులు చేసింది. అయితే.. ఈ దాడిలో దాదాపు 300 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు సమాచారం.

అయితే.. బాలాకోట్ సమీపంలోని జాబాలో ఉన్న ఒక గ్రామస్తుడుని ప్రశ్నించగా.. తీవ్రవాదులా..? ఎక్కడ చనిపోయారు..? చనిపోతే.. వాళ్ల మృతదేహాలు కనపడాలి కదా..! అని జవాబు ఇచ్చాడు. అంతేకాకుండా.. బాలాకోట్ లో ఎటువంటి తీవ్రవాదులూ లేరని.. అన్నాడు ఓ 62 ఏళ్ల నూరన్ షా అనే ముసలివాడు.

రాయిటర్స్ అనే వ్యక్తి భారతదేశం బాలాకోట్‌పై జరిగిన దాడిపై సర్వే చేశారు. ఇందులో భాగంగా బాలాకోట్ లో దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లాడు రాయిటర్సో. అక్కడ.. మంచంపై కూర్చున్న నూరన్ షా అనే 62 ఏళ్ల వ‌ృద్ధుడిని అడగగా.. ఆయన మేము ఇక్కడే చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ తీవ్ర వాదులు ఉన్నారా..? అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 14న భారతదేశ జవాన్లపై దాడి జరిగిందని.. అందుకు ప్రతీకారంగా ఇక్కడ దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే.. దాడి చేసిన మాట వాస్తవమే కానీ.. ఇక్కడ ఎటువంటి తీవ్రవాదులు లేరని.. ఎవరూ చనిపోలేదని అన్నాడు నూరున్ షా. కేవలం చెట్టు మాత్రమే కాలిపోయాయి పడిపోయాయని తెలిపారు.

అలాగే.. రాయిటర్సో అక్కడే ఉన్న కొంత మంది గ్రామస్తులతో కూడా మాట్లాడటం జరిగింది. జాబ్ గ్రామంలో దాదాపు 400 నుంచి 500 వందల మంది నివసిస్తున్నారు. వారిలో దాదాపు 50 మందిని ప్రశ్నించాడు రాయిటర్స్. వారందరు కూడా ఇలాంటి సమాధానాలే ఇచ్చారు. అక్కడే నిత్యం ఒక ట్రక్కులో తిరిగే ఓ వ్యక్తి.. దాడి జరిగిన ప్రాంతంలో ‘నేను ఏ మృత దేహాలను చూడలేదని, కొంతమంది గాయపడ్డారు అని’ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇదంతా అబద్ధం, చెత్తని కొట్టి పారేశాడు.

జైష్ ఎ మహ్మద్ చాలా చురుకైన శిక్షణా శిబిరమని, ఈ శిక్షణలో పిల్లలకు చోటు లేదని నూరున్ షా అన్నారు. అయినా.. బాలాకోట్ లో తీవ్రవాద శిబిరం లేదని, కొన్ని సంవత్సరాల క్రితమే దీన్ని వేరే ప్రదేశానికి తరలించారని నూరున్ షా చెప్పాడు.