హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇరు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో ఈ విషయాన్ని గవర్నర్కు తెలపాలనుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ఆయన భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం ఆయన తన పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అవుతారు. డేటా వివాదంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు.