Big News Big Debate: ఏపీలో అప్పుడే ఎలక్షన్ మూడ్… దూకుడు పెంచిన పార్టీలు.. ధీటైన విమర్శలు

Updated on: May 27, 2022 | 7:21 PM

APలో పార్టీలు స్పీడు పెంచాయి. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మహానాడును గ్రాండ్‌ గా చేస్తుంటే.. సామాజిక న్యాయభేరి పేరుతో మంత్రులు బస్‌ యాత్రను ఇంకా గ్రాండ్‌ గా ప్లాన్‌ చేశారు.

APలో పార్టీలు స్పీడు పెంచాయి. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మహానాడును గ్రాండ్‌ గా చేస్తుంటే.. సామాజిక న్యాయభేరి పేరుతో మంత్రులు బస్‌ యాత్రను ఇంకా గ్రాండ్‌ గా ప్లాన్‌ చేశారు. మొత్తానికి ఉత్తరాంధ్ర నుంచి మంత్రులు టూరు రాజమండ్రి వరకూ చేరింది. అటు కోస్తాలోని ప్రకాశం జిల్లాలో మహానాడు ఓపెనింగ్‌ స్పీచ్‌తో కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. విమర్శలతో వైసీపీని టీడీపీ ఉక్కిరిబిక్కిరి చేస్తే.. అటు నుంచి రియాక్షన్‌ కూడా అంతే స్పీడుగా వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ్ముళ్లపై ముప్పేట దాడి చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఎలక్షన్ మూడ్‌ కనిపిస్తోంది. మాటలు అగ్గి రాజేస్తున్నాయి.

Published on: May 27, 2022 07:21 PM
Follow Us