లైన్లోకి బండ్ల.. ఏపీ రాజకీయ నాయకులకు గట్టి క్లాస్..!
రాజకీయాలకు ఆ మధ్యనే గుడ్బై చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోన్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. తాజాగా లైన్లోకి వచ్చారు.
రాజకీయాలకు ఆ మధ్యనే గుడ్బై చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోన్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. తాజాగా లైన్లోకి వచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా వారికి పెద్ద క్లాస్ పీకారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు చేశారు.
“ఎలక్షన్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు ప్రజలు గమనించగలరు. టీవీలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ప్రతి నెల ఎలక్షన్స్ వస్తాయేమో అన్న భయంతో డిబేట్లలో పాల్గొన్నట్లు అనిపిస్తుంది. ఇది జీవన్మరణ పోరాటం దయచేసి రాజకీయాలు పక్కనపెట్టి దేవుడి మీద ప్రమాణాలు పక్కనపెట్టి ప్రజలను కాపాడండి. తెలంగాణ రాజకీయ నాయకులు చూసి కష్టకాలంలో ఎలా ఉండాలో నేర్చుకోండి. ఇది రాజకీయాలకు సమయం కాదు. ఇది బతుకు పోరాటం దయచేసి అర్థం చేసుకొని రాజకీయాలు చేయండి” అని అని ఆయన ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్లకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్పై ఆయన ప్రశంసలు కురిపించడం విశేషం.
Read This Story Also: లాక్డౌన్ పొడిగించినా కరోనా వ్యాప్తి తగ్గదు: ఫిచ్ సొల్యూషన్స్